రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ జనగామ జిల్లా కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుపై జనగామ పట్టణంలో కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. ధర్మకంచ బస్తీలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. పట్టణ ప్రగతిలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై స్థానిక ప్రజలతో కేటీఆర్ మాట్లాడారు. పట్టణంలో మరిన్ని స్వచ్ఛ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉన్నారు.
జనగామలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన